ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు పెట్టి యువతికి వేధింపులు

ఎల్బినగర్లో ఉద్యోగం చేసే సమయంలో పరిచయమైన రాజు వేధింపులు భరించలేక ఆ యువతి ఉద్యోగం వదిలి వచ్చిందని చెప్పారు. దీంతో రాజు ఫేస్బుక్ ద్వారా తనను వేధించడం ప్రారంభించాడని యువతి ఫిర్యాదు చేసిందని తెలిపారు.
నేవీ ఉద్యోగినంటూ మోసం
నేవీ ఉద్యోగినంటూ పరిచయం చేసుకుని, స్నేహం నటించి బంగారు గొలుసు, నగదు, వాహనాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. బాధితులు నెట్టెం మధు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కొంత కాలం క్రితం నాగేంద్ర అనే వ్యక్తి మధుకు నేవీలో ఉద్యోగినంటూ పరిచయమయ్యాడు.
తనకు మంచి ఉద్యోగం వేయిస్తానని ఆశ చూపి పరిచయాన్ని పెంచుకున్నాడు. పెళ్లి చూపులకు వెళ్లి వస్తానని చెప్పి మెడలోని రెండు తులాల బంగారం గొలుసు, రూ. 35వేల నగదు, వాహనం తీసుకొని పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications