విల్లు ఎక్కు పెట్టిన షర్మిల: జగన్ అభివాదం (పిక్చర్స్)
కృష్ణా/విశాఖ/తూర్పుగోదావరి: ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రెండో పెద్ద నగరమని, దీన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ మేలు జరగాలంటే తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ, రంపచోడవరం, కరపల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కి పిచ్చోడికి తేడా లేదని విమర్శించారు. ఆయనవన్నీ గాలి మాటలేనని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు విలువలు, విశ్వసనీయత లేదనీ, అతనికి లెక్కలేనంత తిక్క ఉందని ఆరోపించారు అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, భీమిలి, విశాఖనగర పరిధిలోని చినవాల్తేరు, రాంనగర్, హెచ్బి కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాల్టీగా చేయలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే కారణమని ఆమె ఆరోపించారు.

జగన్ అభివాదం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జగన్ ప్రసంగం
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రెండో పెద్ద నగరమని, దీన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

షర్మిల ప్రసంగం
జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ, రంపచోడవరం, కరపల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఫ్యాన్ చూపుతూ..
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

షర్మిల అభివాదం
షర్మిల మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కి పిచ్చోడికి తేడా లేదని విమర్శించారు.

విల్లు ఎక్కు పెట్టిన షర్మిల
పవన్ కళ్యాణ్కు విలువలు, విశ్వసనీయత లేదనీ, అతనికి లెక్కలేనంత తిక్క ఉందని ఆరోపించారు అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారని విమర్శించారు.

విజయమ్మ ప్రసంగం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, భీమిలి, విశాఖనగర పరిధిలోని చినవాల్తేరు, రాంనగర్, హెచ్బి కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

విజయమ్మ అభివాదం
తన సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాల్టీగా చేయలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.












Click it and Unblock the Notifications