షర్మిల తో ఆస్తుల వివాదంపై జగన్ ఓపెన్ కామెంట్స్..!!
మాజీ సీఎం జగన్ తన చెల్లి షర్మిలతో వివాదం పై తొలి సారి స్పందించారు. ఆస్తుల వ్యవహారం లో జగన్ - షర్మిల మధ్య ఉన్న వివాదాల పైన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు రాజకీయంగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ - షర్మిల ఒకరికి మరొకరు రాసిన లేఖ లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ మీడియాలో వస్తున్న కథనాల పైన స్పందించారు. మీడియాకు సూచనలు చేసారు.
బాధితులకు ఆర్దిక సాయం
విజయనగరం జిల్లా గుర్లలో అతిసార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉన్న చోట ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. శానిటేషన్ గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. పాఠశాలల బెంచుల పైన ఉంచి చికిత్స ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తాను ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం ఈ గ్రామంలో బాధితుల పరిస్థితి పట్టించుకోలేదన్నారు. డయేరియా బారిన పడిన వారికి కార్పోరేట్ ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదని జగన్ నిలదీసారు.

ప్రభుత్వ వైఫల్యమే
గుర్ల గ్రామంలో డయేరియాతో 14 మంది మరణించటం ప్రభుత్వ వైఫల్యమేనని జగన్ ఆరోపించారు. తమ హయాంలో గ్రామంలోనే అన్ని వసతులు అందుబాటులో ఉండేవని గుర్తు చేసారు. విలేజ్ క్లినిక్ లను పీహెచ్ సీలతో అనుసంధానం చేసామని.. ఏఎన్ఎం లు గ్రామాల్లోనే ఉండేవారని వివరించారు. సెప్టెంబర్ 20న తొలి డయేరియా కేసు నమోదు అవుతే 35 రోజులు అయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. గుర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో 340 మంది చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. చంపా నదిలో దారుణమైన స్థితిలో నీళ్లు ఉన్నాయన్నారు. వాటర్ స్కీమ్ మెయిన్ టెయినెన్స్ కూడా రెన్యువల్ చేయలేదని విమర్శించారు.
తల్లి, చెల్లి ఫొటోలతో రాజకీయం
వైద్యం అవసరమైన వారికి విశాఖ, విజయనగరం ఎందుకు తరలించలేదని జగన్ ప్రశ్నించారు. క్లోరినేషన్ కూడా చేయలేదన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. డయేరియాతో మరణించిన వారి కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించారు. ఇక, తన చెల్లితో వివాదం పైన జగన్ స్పందించారు. టీడీపీతో పాటుగా వారి మద్దతు మీడియా తన చెల్లి, తల్లి ఫొటోలతో రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మీ ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు లేవా అని జగన్ ప్రశ్నించారు. అందరి ఇంట్లో ఉన్నదే తమ ఇంట్లో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం వదిలేసి ప్రజా సమస్యల పైన పని చేయాలని జగన్ సూచించారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications