జగన్ పాదయాత్రకు ఎమ్మెల్యేలు రాకుంటే ఏమిటి, ఏం జవాబు చెప్తారు: బీజేపీ
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరైనది కాదని బీజేపీ శాసన సభా పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరైనది కాదని బీజేపీ శాసన సభా పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు.
దీని వల్ల నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేసే సమయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాకపోవడంలో ఇబ్బంది ఏమీ ఉండదన్నారు.

కానీ అందరూ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంవల్ల ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications