ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరోలా కనిపించడం కోసం, ఆ ప్లైట్ ఎక్కుతావా: ఆళ్లగడ్డలో బాబు- అఖిలను టార్గెట్ చేసిన జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మంత్రి అఖిలప్రియను టార్గెట్ చేసారు. అఖిలప్రియ వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మంత్రి అఖిలప్రియను టార్గెట్ చేసారు. అఖిలప్రియ వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.

Recommended Video

YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారుబోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారు

ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల కృష్ణానదిలో బోటు మునిగి ఇరవై మందికి పైగా మృతి చెందారు. దీంతో జగన్ ఆమెను టార్గెట్ చేశారు. అఖిలప్రియ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ ముందుకు తీసుకు వచ్చారు.

 బాబు, అఖిలప్రియ రాజీనామా చేయాలి

బాబు, అఖిలప్రియ రాజీనామా చేయాలి

ఆయన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫెర్రీ బోటు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రతిపక్ష నేత ప్రశ్నించాహరు.

 అవి ఏమయ్యాయి

అవి ఏమయ్యాయి

నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి ఘటన, మెడికో ఆత్మహత్యపై కమీషన్లు ఏమయ్యాయో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల మాదిరిగా కొంటున్నారని మండిపడ్డారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

 చంద్రబాబు హీరోలా కనిపించడం కోసం

చంద్రబాబు హీరోలా కనిపించడం కోసం

పుష్కరాల సమయంలో సినిమా షూటింగ్‌లో హీరోలా కనిపించడం కోసం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో వీఐపీ ఘాట్‌లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్‌కు వెళ్లి స్నానం చేశారని జగన్ మండిపడ్డారు. షూటింగులో ఎఫెక్టు కోసం అన్నట్లు ఒక్కసారిగా భక్తులను ఘాట్‌లోకి వదిలారని, ఫలితంగా జరిగిన తొక్కిసలాటకు సీఎం బాధ్యులు కారా అని నిలదీశారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు వేసిన కమిషన్ల నివేదికలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

 చంద్రబాబు ఇంటికి కూత వేటు దూరంలో ప్రమాదం

చంద్రబాబు ఇంటికి కూత వేటు దూరంలో ప్రమాదం

కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు ఉంటున్నారని, ఇంటికి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగితే స్పందించ లేదని జగన్ మండిపడ్డారు. ఏమన్నా అంటే బోటు డ్రైవర్‌కు లైసెన్సు లేదంటున్నారని విమర్శించారు.

 బాబు, లోకష్ ఎక్కిన విమానంలో లైసెన్స్ లేని పైలట్ ఉంటే

బాబు, లోకష్ ఎక్కిన విమానంలో లైసెన్స్ లేని పైలట్ ఉంటే

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్కిన విమానంలో లైసెన్సు లేని పైలట్‌ ఉంటే అప్పుడు పడవ మునక బాధితుల బాధ ఏమిటో వారికి తెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.

 ఆళ్లగడ్డలో పాదయాత్ర

ఆళ్లగడ్డలో పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ జగన్ పాదయాత్ర కొనసాగింది. కృష్ణాపురం నుంచి మొదలైన పాదయాత్ర పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదుగా 11.5 కి.మీ. మేర పాదయాత్ర సాగింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday demand for Minister and Telugu Desam party leader Akhila Priya resgingation after boat tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X