'చంద్రబాబును ఆ మాట అనడం జగన్ తప్పిదం, ప్రతి ఏడాది వస్తాయా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పారు.
నారా లోకేష్ వద్దు.. అందుకేనా?: రేవంత్కు 'నో' చెప్పిన బాబు
ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోసి తాను అధికారంలోకి వస్తానని జగన్ చెప్పడం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారం అయిదేళ్లకోసారి ఎన్నికలు జరగాలని చెప్పారు. జగన్ మాత్రం ప్రతి సంవత్సరం ఎన్నికలు వస్తాయన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు స్మార్ట్ పల్స్ సర్వే, తమ్ముళ్ల డౌట్: టిడిపికి నష్టమా?
జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని విమర్శించడం సరికాదన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు అవుతుందని జగన్ తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబు సమక్షంలో టిడిపి సమీక్షా కమిటి భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధవారం నాడు టిడిపి సమీక్షా భేటీ సమావేశమయిందిత. ఈ భేటీలో ప్రభుత్వం పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లడం, పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించడంపై చర్చిస్తున్నారు. భేటీకి కమిటీ సభ్యులు, టాప్ 25 మంది ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications