YSR jayanti: నాన్నా.. అంటూ వైఎస్ జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వైఎస్సార్ జయంతి .. జగన్ ఎమోషనల్ ట్వీట్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రితో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. వైయస్ఆర్ జయంతి నాడు ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నాన్నా... మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు అంటూ పేర్కొన్నారు. కోట్లాది కుటుంబాలు ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు జగన్.

మీరు చూపించిన ధైర్య సాహసాలు మాకు మార్గం
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నారని పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో ఎమోషనల్ అయిన వైయస్ జగన్ ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం అంటూ పేర్కొన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోరశ్రమ, రాజకీయాలలో మీరు చూపించిన ధైర్య సాహసాలు మాకు మార్గం అంటూ వెల్లడించారు.
తండ్రి అడుగుజాడల్లో జగన్: నెటిజన్ల స్పందన
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి సాగుతుంది అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక తండ్రి అడుగుజాడల్లో జగన్ అంటూ వైసీపీ అభిమానులు జగన్ పెట్టిన పోస్ట్ పైన స్పందిస్తున్నారు. మహానేత మార్గాన్ని అనుసరిస్తున్న మా నేత జగన్ అంటూ పలువురు ఆయనపై అభిమానం వ్యక్తం చేస్తున్నారు.
నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024
దివంగత మహానేతకు నివాళులు
కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో పాలనలో తన మార్క్ చూపించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి, తల్లి విజయమ్మతో పాటు పలువురు కుటుంబ సభ్యులు దివంగత మహానేతకు నివాళులర్పించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications