జగన్ హెలికాఫ్టర్ ఘటన- కీలకంగాా పైలట్, కోపైలట్ వాంగ్మూలాలు..!
ఏపీలో ఈ నెల 8న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో ఆయన హెలికాఫ్టర్ పైకి జనం ఎగబడ్డారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఈ ఘటనతో జగన్ భద్రతా లోపాలు బయటపడ్డాయి. దీనిపై వైసీపీ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆ రోజు హెలికాప్టర్ నడిపిన పైలట్, కో పైలట్ కు విచారణకు రావాలని సత్యసాయి జిల్లా సీకే దిన్నె పోలీసులు నోటీసులు పంపారు. దీంతో వారు ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 8న జగన్ ను పైలట్, కోపైలట్ హెలికాప్టర్ లో పాపిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ ను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ ద్వంసం అయింది. అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కోపైలట్ వెళ్లిపోయారు.

దీంతో జగన్ పర్యటన రోజు జరిగిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై వివరాలు రాబట్టేందుకు పైలట్, కోపైలట్ కు నోటీసులు జారీ చేసి ఇవాళ పిలిపించారు. విచారణలో పైలట్, కో పైలట్ చెప్పే వివరాల ఆధారంగా ఇందులో తప్పెవరిదో తేల్చబోతున్నారు. వైసీపీ ఇప్పటికే దీన్ని జగన్ భద్రతలో పోలీసుల లోపంగా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు పోలీసులు తమ విచారణలో ఏం తేల్చబోతున్నారనేది కీలకంగా మారింది.
వీఐపీ అయిన జగన్ హెలికాఫ్టర్ వరకూ జనం వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదన్న విషయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైలట్, కోపైలట్ తప్పిదం ఉంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా ఈ ఘటనతో వీఐపీల భద్రతపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications