జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్, మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతలు.. కేడర్ పైన కేసుల విషయంలో జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు అక్రమంగా కేసు లు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. కాగా.. రాజకీయంగా జగన్ నిర్ణయాలు అంతు చిక్కటం లేదు. ఏడాది కాలంగా వస్తున్న మంచి అవకాశాలను జగన్ మిస్ చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ తాజా నిర్ణయాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
మాజీ సీఎం జగన్ వ్యూహాల్లో లోపం కనిపిస్తోందా. 2014 ఎన్నికల్లో ఓడిన తరువాత కనిపించిన జగన్.. 2024 లో ఓటమి తరువాత జగన్ శైలికి పోలిక లేదు. 2014 లో ఓడిన తరువాత తిరిగి ఎలాగైనా గెలిచి సీఎం కావాలనే కసి.. పట్టుదల కనిపించాయి. పూర్తిగా పార్టీ నేతలకే సమయం కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాల పైనే గురి పెట్టేవారు. ప్రజా సమస్యల పైన దీక్షలు.. నిరసన లు.. పోరాటాలు చేసారు.

ఆ తరువాత సుదీర్ఘ పాదయాత్రతో జనంతో మమేకం అయ్యారు. ఫలితం 2019 ఎన్నికల్లో 151 సీట్లతో సీఎం అయ్యారు. నాటి రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. కాగా, 2024 ఎన్నికల ఫలితాల తరువాత జగన్ వారంలో మూడు రోజులు తాడేపల్లి.. మిగిలిన రోజులు బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. ప్రతిపక్ష హోదా కూటమి నేతలకు ఇచ్చే ఉద్దేశం లేదని తెలిసినా.. అదే కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు.
2014-17 కాలంలో అసెంబ్లీలో జగన్ ప్రసంగాలు చూసిన వారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాల పైనా అదే తరహాలో అసెంబ్లీలో స్పందించాలని కోరుకున్నారు. అయితే, జగన్ సభకు దూరంగా ఉంటున్నారు. తనకు సమయం ఇచ్చినా.. ఇవ్వకున్నా సభలోనే తన నిరసన తెలిపే హక్కు ఉన్నా అందుకు సుముఖంగా లేరు. తాను చెప్పదలచుకున్నది గంటల కొద్ది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నారు.

అవి ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తున్నాయనేది పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి కేడర్ వద్దకు వెళ్లి.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు రోజులు ఉంటానని జగన్ ప్రకటించారు. మళ్లీ సంక్రాంతి వస్తున్నా.. ఇప్పటికీ అమలు కాలేదు. జగన్ ఏ ప్రత్యక్ష పోరాటంలోనూ పాల్గొన లేదు. కొంత మంది నేతలను జైలు పరామర్శలకు పరిమితం అయ్యారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామర్శించారు.
తన పార్టీ నేతలు, కేడర్ పైన కేసులు పెడుతున్న అంశం పైన మాత్రం తన మార్క్ స్పందన ఏంటో చూపించారు. కూటమి నేతలు మూకుమ్మడిగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆ స్థాయిలో కౌంటర్ చేసే వారు తగ్గిపోయారు. మెడికల్ కాలేజీల పైన పోరాటం మినహా ఈ 18 నెలల కాలంలో వైసీపీ చెప్పుకునే స్థాయిలో ఏం చేయలేదు. ఇప్పటికీ జగన్ ను పార్టీ నేతలు.. కేడర్ కలవాలంటే అప్పాయింట్ మెంట్లు దొరకటం లేదు.

జగన్ ఎన్నికలు జరిగి 20 నెలలు అవుతున్నా.. పూర్తి స్థాయిలో ఏపీలో అందుబాటులో ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పటం మినహా.. ఆ వ్యతిరేకత తనకు అనుకూలంగా మలచుకునే ఆలోచనలో జగన్ వెనుకబడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతు న్న వేళ.. ఇప్పటికైనా జగన్ కార్యాచరణ.. వ్యూహాల్లో మార్పు వస్తుందా.. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే నమ్ముకొని ఉంటారా అనేది కేడర్ ఆసక్తిగా గమనిస్తోంది. మరి.. జగన్ ఏం చేస్తారో 2026 లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో వేచి చూడాలి.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications