వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్‌పై వచ్చి గవర్నర్‌ను కలుస్తారా: జగన్‌పై సోమిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
నెల్లూరు: సిబిఐ కోర్టు షరతులతో జైలు నుండి బయటకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలవడం కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.

షరతులతో కూడిన బెయిల్ పైన విడుదలైన జగన్ గవర్నర్‌ను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. అలా కలవడం కోర్టు ధిక్కారణే అన్నారు. గవర్నర్‌ను జగన్ కలవడం ద్వారా సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందన్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు బాలశౌరీ జిల్లాలో పవర్ ప్రాజెక్టు పేరుతో రూ.750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతికి పాల్పడిన వారంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు.

కేంద్రమంత్రుల ప్రవర్తన తెలుగు వాళ్ల గొంతు కోసేలా ఉందన్నారు. కేంద్రమంత్రులు రాజీనామాలు అని చెబుతూ డ్రామాలు ఆడుతూ ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారని ధ్వజమెత్తారు.

జగన్ పార్టీతో పొత్తు లేదు: రాఘవులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సిపిఎం సీట్ల బేరం కుదుర్చుకుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. జగన్ పార్టీతో తమకు ఎలాంటి సర్దుబాట్లు, సీట్ల బేరం లేదన్నారు. తమకు చాటుమాటుగా మాట్లాడుకునే అలవాటు లేదని నారాయణకు కౌంటర్ ఇచ్చారు. పొత్తులపై నారాయణ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఈ మేరకు రాఘవులు బహిరంగ లేఖ విడుదల చేశారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy on Friday questioned this is the violation of court that YS Jagan meeting with governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X