రాజకీయాలకు విరామం: సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు హల్చల్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిత్యం ఓదార్పు యాత్రలు, నిరాహార దీక్షలు, ప్రజా సమస్యల పైన ఉద్యమాలతో బీజీగా ఉండే జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన తన కుటుంబంతో సహా ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనలో భాగంగా జగన్ కుటుంబం బుధవారం నాడు ఈడెన్ బర్గ్ చేరుకుంది. జగన్ ఆటవిడుపుగా గోల్ఫ్ ఆడారు. పది రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఏడు రోజుల పాటు యూకేలో, మూడు రోజులు ఐర్లాండ్, స్కాట్లాండ్లో గడుపుతున్నారు.
జగన్ పది రోజుల పర్యటనలో భాగంగా జూన్ 16వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులతో బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లారు. జగన్ తన సతీమణి భారతి, ఇద్దరు పిల్లలతో కలిసి పర్యటనకు వెళ్లారు. చాలా రోజుల తర్వాత జగన్ పూర్తిస్థాయిలో కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లారు.