రాయలసీమపై కన్నేసిన నారా లోకేష్, కోస్తాంధ్రపై జగన్ దృష్టి
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టున్న రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దృష్టి సారించారు. స్వయంగా రంగంలోకి దిగిన నారా లోకేష్ సోమవారం పార్టీ పటిష్టతపై ఆయా జిల్లాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మొన్నటి వరకు ఖాళీగా ఉన్న జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శలకు అప్పగించారు. ఏపీలో రాయలసీమ వైసీపీకి పెట్టని కోటలాగా ఉంది. ఇప్పుడు దానిపై దృష్టి సారిస్తే 2019 ఎన్నికల కల్లా పార్టీని పటిష్టం చేయవచ్చనే ఆలోచనగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు.
మరోవైపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీని పటిష్టం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జమ్మల మడుగు టిడిపి ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డితో బాలకృష్ణ, లోకేష్ చర్చలు జరిపారని సమాచారం.

అయితే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీలోకి ఆదినారాయణ రెడ్డి చేరాలా వద్దా అనే సందిగ్ధంలో పడటంతో ఈ విషయం అలా ఆగింది. మరోవైపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి పట్టున్న కోస్తాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయా జిల్లాల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా చూసేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలనే అంశంపై జగన్ పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications