మేం డిఫెన్స్లో పడలేదు: పెద్దిరెడ్డి, జగన్ కోపం తగ్గేందుకు డొక్కా సలహా
నందిగామ ఆసుపత్రిలో తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో తాము ఎలాంటి డిఫెన్సులో పడలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం నాడు అన్నా
హైదరాబాద్: నందిగామ ఆసుపత్రిలో తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో తాము ఎలాంటి డిఫెన్సులో పడలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం నాడు అన్నారు.
ఐఏఎస్ అధికారుల తీరు సరికాదని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగానిది అదే బాట అని దుయ్యబట్టారు.
కలెక్టర్కు ఉదయం నుంచి ప్రమాద స్థలంలో ఏం పని అని నిలదీశారు. జగన్ వ్యాఖ్యలతో తాము డిఫెన్సులో పడలేదన్నారు. జగన్ను అవమానించేలా కలెక్టర్ వ్యవహరించారని ఆగ్రహించారు. బస్సు యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు.

జగన్ యోగా నేర్చుకోవాలి: డొక్కా
వైసిపి అధినేత వైయస్ జగన్ తన తీరు మార్చుకోకుంటే రాజకీయ మనుగడ సాధించలేరని టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కోపం తగ్గించుకునేందుకు జగన్ యోగా నేర్చుకోవాలని సూచన చేశారు.
జగన్ తీరు మారాలి: పోలీసు సంఘం
జగన్ అధికారులపై దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు అన్నారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జగన్ వ్యవహరించిన తీరును ఖండించారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రశ్నించడం తప్పుకాదని, ప్రశ్నించే విధానమే తప్పు అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగ్గి ప్రవర్తించకూడదని హితవు పలికారు.
పోలీసుల సమస్యలపై పోరాడతామని వైసిపి నేతలు చెబుతున్నారని, పోలీసుల సమస్యలపై ఏనాడైనా జగన్ ప్రస్తావించారా అని నిలదీశారు. పోలీసులంతా అవినీతిపరులేనని, అందరినీ జైలుకు పంపిస్తానని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications