Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంబటి కోసం రంగంలోకి జగన్, కీలక నిర్ణయం..!!

అంబటి రాంబాబు వ్యవహారం కీలక మలుపు తీసుకుంటోంది. మాజీ మంత్రి అంబటి గుంటూరు లో ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు మండిపడ్డారు. అంబటిని టార్గెట్ చేసారు. గుంటూరు రాంబాబు ఇంటి వద్ద అనూహ్య ఘటనలు చోటు చేసుకు న్నాయి. అంబటి ఇంటి పైన జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన పైన పార్టీ నేతలతోనూ మాట్లాడారు.

అంబటి రాంబాబు వివాదం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గుంటూరు జిల్లా నేతలతో మాట్లాడారు. పార్టీ నేతలు రాంబాబుకు మద్దతుగా వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుతో పాటుగా గవర్నర్, కేంద్ర హోం శాఖను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు. అందులో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిపోయిందని వైయస్‌ జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యా యత్నాలు, దాడులకు దిగుతున్నారని, తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో చంద్రబాబు చేసిన కుట్ర విఫలమవడంతో భంగపడి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు.ఈ ఘటన ను గవర్నర్, కేంద్ర హోం శాఖకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

ys-jagan-to-console-ambati-rambabu-family-along-with-party-seniors-in-guntur-as-reports

పార్టీ నేతలతో కీలక భేటీ

పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న వేళ.. ఢిల్లీలో ఎంపీలు ఈ ఘటన పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్దేశించారు. అదే విధంగా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్... ఏపీకి రాగానే నేరుగా గుంటూరు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రాంబాబు పైన ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయి. రాంబాబుకు రిమాండ్ విధిస్తే జైలుకు వెళ్లి పరామర్శించాలని... ముందుగా అంబటి కుటుంబ సభ్యులను కలవాలని డిసైడ్ అయ్యారు.

ఇదే సమయంలో ఈ రోజు వైయస్సార్‌సీపీ ముఖ్యనేతలు అంబటి కుటుంబాన్ని పరామర్శించ నున్నారు. పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజని, మాజీ ఎంపీలు మోదుగుల, నందిగం సురేష్‌ తో పలువరు నేతలు అంబటి నివాసానికి వెళ్లనున్నారు. గుంటూరు జిల్లా నేతలను సోమవారం అందుబాటు లో ఉండాలని జగన్ నిర్దేశించారు. అంబటి ఇంటి పైన జరిగిన దాడి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+