మేమూ అధికారంలోకొస్తాం... చూస్కోండి: అనంత పోలీసులకు జగన్ వార్నింగ్
అమరావతి: అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆదివారంతో ముగిసింది. రైతు భరోసా యాత్ర ఆరంభం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన వైయస్ జగన్ ఆదివారం అనంతపురం జిల్లా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
అధికార పార్టీ టీడీపీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు తమ పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతుంటాయన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వమే పట్టపగలు ఖూనీలు చేసే స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ ప్రకాశ్ రెడ్డిని చంపాలని చూశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు మానవతా దృక్పథంతో పనిచేసి న్యాయాన్ని కాపాడాలని అన్నారు. ''ప్రభుత్వాలు మారుతుంటాయి. మేమూ అదికారంలోకి వస్తాం. చూస్కోండి" అని జగన్ పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని చెప్పిన జగన్ జీతాలిస్తున్నది చంద్రబాబు కాదని.. ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి'' అని అన్నారు. అంతక ముందు ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లిలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 'ఎన్నికలకు ముందు చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదు.. సీమ భాషలో అలాంటి మోసగాళ్లను చెప్పులతో కొట్టాలనంటాం... అయితే ఆ మాట నేనడం లేదప్పా... బాబుకు చెప్పు ఇష్టం లేదట.. ఈసారి చీపుర్లు చూపించండి' అని అన్నారు.
ఆ తర్వాత డబురువారిపల్లి, కొండకమర్ల, నల్లమాడ, నల్లశింగయ్యగారిపల్లి, మలకవేమల క్రాస్ మీదుగా భరోసా యాత్ర ముదిగుబ్బ మీదుగా జగన్ అనంతపురం చేరారు. సాయంత్రం అక్కడి అంబేద్కర్ కూడలిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాట కోసం నిలబడాలని అన్నారు. అప్పుడే రాజకీయాలకు విశ్వసనీయత వస్తుందని, అది దివంగత వైఎస్కే చెల్లిందని అన్నారు. విశ్వసనీయతకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. మోసాలు చేసేవారిపైన, పిక్పాకెట్కు పాల్పడే వ్యక్తులపైన 420 కేసులు నమోదు చేస్తారని, ఆయనపైనా అదే కేసు పెట్టాలన్నారు.
'వాగ్దానాలు నెరవేర్చకపోయినా నన్నెవడు అడుగుతాడు? ఎవరు ప్రశ్నిస్తారు? అనే అభిప్రాయంలో బాబు ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొన్నారు. ఈ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ప్రజల గొంతు మూగబోతుందని బాబు అనుకుంటున్నారు.
కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా చేయించాలి. ఎన్నికలకు వస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని అన్నారు. ఈ రెండేళ్లలో ఆయన ప్రజలను మోసగించడం తప్ప... చేసింది శూన్యం. అవినీతిలో నిండా మునిగిపోయారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ మంత్రులు రాజీనామా చేస్తారని అల్టిమేటం ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు.
రెండేళ్లలో తాను చేసిన అవినీతిపై సీబీఐతో ప్రధాని విచారణ చేయిస్తారనే భయంతోనే చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ను నిలదీయడం లేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన చంద్రబాబుని జైల్లో పెడతారని భయంతోనేనని అన్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications