చేయలేం, రూ.50వేలు ఇస్తాం: ఎమ్మెల్యేలకు యనమల, కొత్తగా.. జగన్ లేఖ
ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాలు కల్పించలేమని, అందుకుగాను వారికి రూ.50వేలు చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు అన్నారు.
హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ సమావేశాలలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాలు కల్పించలేమని, అందుకుగాను వారికి రూ.50వేలు చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు అన్నారు.
మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పారు. మార్చి 13న బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు. ఉగాది లోపు బడ్జెట్ ప్రతిపాదించి, తర్వాత సభను వాయిదా వేయాలనుకుంటున్నామన్నారు.
వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి
స్పీకర్కు జగన్ లేఖ
ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కొత్త అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలు పాటించాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని ఆయన కోరారు.
కాగా, వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోని నూతన అసెంబ్లీ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఉదయం 11.25 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమందిరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలిరానున్న అసెంబ్లీ సచివాలయ ఉద్యోగులు చేరుకుంటారు. స్పీకర్ కూడా సోమవారం నుంచి వెలగపూడి నుంచే విధులు నిర్వహిస్తారని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావు తెలిపారు.
ఇక రాజకీయం, తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టం: బాబు, అమెరికాలో దాడిపై..
అసెంబ్లీ భవనంలో పేషీల కేటాయింపు అంశంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అధికారులతో సమీక్షిస్తారు.
మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీకి కేటాయించిన ఉద్యోగులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకూ రిలీవ్ చేయకుండా ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు.