చంద్రబాబు సర్కార్లో అతిపెద్ద కత్తిపీట
YS Sharmila: రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్తంభించిపోయింది. దీనికింద వైద్య సేవలను అందించడాన్ని అన్ని ఆసుపత్రులు నిలిపివేశాయి. పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్పై ఆసుపత్రులు ఈ సేవలను స్తంభింపజేశాయి.
దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. పలు విమర్శలు సంధించారు. తమ డిమాండ్లను సర్కార్ ముందుంచారు.

పేదవాడి ఆరోగ్యానికి భరోసా అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా అభివర్ణించారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా కూడా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం ఉందనే భరోసా వైఎస్సార్ ప్రభుత్వంలో ఉండేదని అన్నారు.
చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ దీన్ని అనారోగ్యశ్రీగా మార్చిందంటూ షర్మిల మండిపడ్డారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రేనని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ ధ్వజమెత్తారు.
పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా…
— YS Sharmila (@realyssharmila) January 7, 2025
ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తోన్నారంటూ షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ- దీన్ని వదిలించుకునే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం తెర తీసిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు.
వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలంటూ చంద్రబాబుు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తోన్నామని షర్మిల చెప్పారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని అన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications