వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా చెల్లెళ్ల అనుబంధం: జగన్‌కు షర్మిల, కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గురువారం రాఖీ పర్వదినం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయ‌త‌కు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగ‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. భార‌తీయ‌ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండుగే త‌న ఫేవ‌రేట్ ఫెస్టివ‌ల్ అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

తన చెల్లెలు షర్మిలతో రాఖీ క‌ట్టించుకుంటుండగా తీసిన ఓ ఫోటోను ఆయ‌న ట్విట్టర్‌లో పోస్టు చేశారు. త‌న సోద‌రీమ‌ణుల‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు.

రాఖీ పండుగని పురష్కరించుకుని ఎంపీ కవిత తన అన్న మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. ఈ మేరకు తన అన్న మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతుండగా తీసిన ఫోటోలను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందరికీ ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ పౌరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య శాశ్వతమైన బంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించేదే రాఖీ పండుగని పేర్కొన్నారు. ఈ గొప్ప పండుగ సమాజంలో మహిళల రక్షణకు వారి సంక్షేమ వృద్ధికి బాటలు వేసేదిగా ఉండేలా ఈ రోజున మనమంతా సంకల్పించుకోవాలని సూచించారు.

దేశంలోని మహిళలు, అమ్మాయిలు అన్ని వేళలా సురక్షితంగా మనగలిగేలా మనమంతా ఈ పర్వదినాన సోదరభావాన్ని పెంపొందించుకుని వ్యాపింపజేయాలని పేర్కొన్నారు.

English summary
YS Sharmila ties a rakhi to YSR Congress party president YS Jagan Mohan Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X