కొణతాల రామకృష్ణకు వైఎస్ విజయమ్మ ఫోన్..! ఎందుకు?
విశాఖపట్నం : కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించి.. అటు తర్వాత వైసీపీలో చేరిన కొణతాల రామకృష్ణ వైసీపీలోను కొన్నాళ్లు పనిచేశాక పార్టీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలోనన్న డైలామాలోనే ఉన్నారు కొణతాల. ఇలాంటి సమయంలో ఆయనకు విజయమ్మ నుంచి ఫోన్ అంటే.. అదేదో రాజకీయాంశాల చర్చే అనుకుంటారు చాలామంది.
కానీ అలాంటిదేమి లేదు. కొణతాల సతీమణి పద్మావతి (54) గుండెపోటుతో కన్నుమూయడంతో.. విషాదంలో ఉన్న ఆయన్ను ఫోన్ ద్వారా పలకరించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. సోమవారం నాడు ఉదయం కొణతాల సతీమణి తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో.. హుటాహుటిన ఆమెను కేర్ ఆసుపత్రికి తరలించారు.

అయితే వైద్యుల శ్రమ ఫలించకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి, కొణతాల కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. విషాదంలో ఉన్న కొణతాలను ఆత్మీయంగా పలకరించారు విజయమ్మ. ఆయన సతీమణి మరణానికి విజయమ్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications