వైఎస్ విగ్రహం ధ్వంసం: తొలగింపుపై అంబటి ఫైర్
అనంతపురం/ హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని కనగనపల్లి మండలం తగరకుంటలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసుంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, విగ్రహాలను తొలగించాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతోనే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా తమ పార్టీ కార్యకర్తలు, వైయస్ అభిమానులు చూస్తూ ఊరుకోరని ఆయన శనివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు. దురుద్దేశంతో వైయస్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను విగ్రహంగా మార్చింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
టిడిపి అభ్యర్థి సుగుణమ్మకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. మానవతా దృక్పథంతోనే తమ పార్టీ తిరుపతిలో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications