మీకు విలువుందా?: పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేకు ఓటర్లు షాక్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి వైసిపి నుంచి పోటీ చేసి గెలిచారు. గురువారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
ఈ నేపత్యంలో వి.కోటలో వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అమర్నాథ్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వైసిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అంతేకాదు, వి.కోటలో వైసిపి కార్యకర్తలు ఓ పెద్ద బ్యానర్ కట్టారు. అందులో.. ఆ రోజు పార్టీలోకి మిమ్మల్ని ఎవరూ రమ్మని చెప్పలేదని, అలాగే ఈ రోజు మీరు వెళ్తామంటే ఆపేది లేదని, కానీ మిమ్మల్ని మేం ఓట్లు వేసామని, మా ఓట్లు మాకు ఇచ్చి వెళ్లాలన్నారు.
జగన్! నా నోటికి పని చెప్పకు: సైకిలెక్కిన అమర్నాథ్, నెల్లూరు కీలక నేత ఝలక్
మేం మిమ్మల్ని వైసిపి అభ్యర్థిగా గెలిపించామని, అది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అమర్నాథ్ రెడ్డి పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మాకు అనవసరమని, అది ఆయన ఇష్టమని, కానీ మా ఓటు మాకు తిరిగి ఇచ్చేసి పార్టీ మారాలని సూచించారు. ఓటుకు విలువ ఉందని, తరుచూ పార్టీ మారే ఎమ్మెల్యేగా మీకు విలువ ఉందా.. సిగ్గు.. సిగ్గు అని అందులో పేర్కొన్నారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications