సభలో ఘాటు వ్యాఖ్యలు: 'కాల్ మనీ బాబు' 'జగన్ దొంగల ముఠా లీడర్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు మొదటి రోజే కాల్ మనీ వ్యవహారం వేడెక్కింది. కాల్ మనీ కేసులో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. కాల్ మనీ పైన వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.
దీంతో కాల్ మనీ పైన చర్చకు వైసిపి పట్టుబడింది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... కాల్ మనీ పైన రేపు చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ఇప్పుడే కావాలంటూ వైసిపి పట్టుబట్టింది.
ఈ సందర్భంగా టిడిపి, వైసిపిలు పరస్పరం పార్టీ అధినేతలతో నిందితులు ఉన్న ఫోటోలు బయటపెట్టారు. చంద్రబాబుతో బోడె ప్రసాద్ ఉన్న ఫోటోలను వైసిపి ప్రదర్శిస్తే, దూడల రాజేష్తో జగన్ ఉన్న ఫోటోలను టిడిపి బయటపెట్టింది.

'కాల్ మనీ చంద్రబాబు' అంటూ వైసిపి సభలో నినాదాలు చేసింది. వారు ప్లకార్డులు పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. వెల్లోకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా కాల్వ ధ్వజమెత్తారు. విజయవాడను నేరమయం చేసిందే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు.
బీఐసీ సమావేశానికి చంద్రబాబు వచ్చినా జగన్ రాలేదని విమర్శించారు. జగన్ దొంగల ముఠా నాయకుడని కాల్వ మండిపడ్డారు. కాల్ మనీలో ఉన్నదంతా వైసీపీ నేతలేనని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. విలువైన సభా సమయం వృధా చేయవద్దన్నారు. సభా సమయం వృథా చేయవద్దన్నారు. సభలో గందరగోళం చెలరేగడంతో సభాపతి పది నిమిషాలు వాయిదా వేశారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications