Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌పై దాడి కేసులో అనుమానాలు వ్యక్తం చేసిన ధర్మాన, గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసును కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ధర్మాన ప్రసాద రావు, రోజా తదితరులు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రశ్నించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

అనేక అనుమానాలు ఉన్నాయి

అనేక అనుమానాలు ఉన్నాయి

ప్రతిపక్ష నేతపై దాడి కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియకుండా తమ అభిప్రాయాన్ని వెల్లడించిందని ఆరోపించారు. జగన మీద హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించిన తీరును గవర్నర్‌కు చెప్పామని అన్నారు.

హత్యాయత్నం వెనుక ఎవరున్నారో దర్యాఫ్తు చేయాలి

హత్యాయత్నం వెనుక ఎవరున్నారో దర్యాఫ్తు చేయాలి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీజీపీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ధర్మాన చెప్పారు. గవర్నర్ పాత్రను చంద్రబాబు తప్పుబట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, టీడీపీ నేతల తీరును గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. ఏపీలో జీవించే పరిస్థితులు లేవని చెప్పారు. జగన్ పైన హత్యాయత్నం వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాఫ్తు చేయాలని కోరామని చెప్పారు.

 చర్యలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చర్యలు

చర్యలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చర్యలు


రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థచే దర్యాఫ్తు చేయాలని ధర్మాన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థచే దర్యాఫ్తు జరపాలని చెప్పారు. హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పారు. కుట్ర దిశగా విచారణ సాగడం లేదన్నారు.

జగన్, వైవీ సుబ్బారెడ్డిల పిటిషన్లపై విచారణ వాయిదా

జగన్, వైవీ సుబ్బారెడ్డిల పిటిషన్లపై విచారణ వాయిదా


మరోవైపు, జగన్ రిట్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే, వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా పడింది. తనపై జరిగిన హత్యాయత్నంలో కుట్ర దాగి ఉందని జగన్ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే, ఈ ఘటనపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+