పవన్ ఇలా..నాగబాబు అలా : ఫొటోలు..వీడియో లతో సహా నిలదీసిన వైసిపి నేతలు..!
తెలంగాణ ప్రజలు -ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకు పడ్డారు వైసిపి నేతలు. ఎన్నికల ప్రచారం లో పవన్ చేస్తున్న వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు. ఎక్కడ ఆంధ్ర వాళ్లను కొట్టారో..ఎక్క డ బెదిరించారో చెప్పాలని డిమాండ్ చేసారు. పవన్ టిఆర్యస్ నేతలను తిడుతుంటే..ఆయన అన్న నాగబాబు తాను కేసీఆర్ కే ఓటు వేసానని చెప్పారని..ఆయన టిఆర్యస్ నేతలను ప్రశంసిస్తున్నారంటూ వీడియోలు..ఫోటోలు విడుదల చేసారు.
కేఏ పాల్ అసలు పేరు ఇదే : ఆయన లక్ష్యం మెగా సోదరులు : ఓడించి తీరుతా..!
పవన్..వైషమ్యాలు పెంచవద్దు..
జనసేన అధినేత ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పైనా..కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యల పై పోసాని కృష్ణ ముర ళీ..బొత్సా సత్యనారాయణ..సి రామచంద్రయ్య వంటి వారు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ను వాటేసుకొని గొప్ప ము ఖ్యమంత్రి అని అన్న పవన్ ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఏ నేతను తెలంగాణ నేతలు బెదిరిం చారని ఆధారాలు ఉంటే ఇవ్వాలని..తానే వెళ్లి కేసు పెడతానని పోసాని స్పష్టం చేసారు. హైదరాబాద్ లోని ఏపి ప్రజ లు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలను స్పూర్తిగా తీసుకోవాలని కోరింది పవన్ కాదా అని ప్ర శ్నించారు. పవన్ మంచి వ్యక్తి అని..కొందరు ప్రభావంతో అలా మాట్లాడటం సరి కాదన్నారు. ఇలాగే మాట్లాడితే.. హైద రాబాద్ లోని ఆంధ్రుల పరిస్థితి ఏంటని పోసాని ప్రశ్నించారు.
పవన్ ఇలా..నాగబాబు అలా..
ఇక, తెలంగాణా..పాకిస్థానా అని పవన్ ప్రశ్నించటాన్ని నేతలు తప్పు బట్టారు. పవన్ తో సహా మెగా కుంటుంబంలోని అందరూ హైదరాబాద్లోనే ఉన్నారని..ఎవరైనా దాడి చేసారా..ఎవరి ఆస్తులైన లాగేసారా అని సి రామచంద్రయ్య ప్రశ్నించారు. జనసేన నుండి నర్సాపురం ఎంపీగా బరిలో ఉన్న పవన్ అన్నయ్య నాగబాబు తెలంగాణ ఎన్నికల సమ యంలో తాను టిఆర్యస్ కే ఓటు వేసానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. తెలంగాణలో టిఆర్యస్ గెలిచి నందుకు ఆ పార్టీ నేతలను నాగబాబు ప్రశంసించారు. పతన్ సైతం కేసీఆర్ వద్దకు వెళ్లి తన సినిమా గురించి చర్చిం చిన విషయాన్ని..బాలకృష్ణ సైతం కేసీఆర్ తో భేటీ అయిన విషయాన్ని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు. రాజకీయం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా పవన్ వ్యవహరించటం సరి కాదన్నారు.
మా ఒంట్లోనూ రక్తమే ఉంది..
పవన్ చేస్తున్న విమర్శల పై వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. తమ ఒంట్లోనూ రక్తమే ఉందని..ఇటువంటి ఆరోపణలు సరి కాదని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మానేసి ప్రతిపక్షం పై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. జనసేన ను టిడిపిలో కలిపి వేయటం ఖాయమని భీమవరం వైసిపి అభ్య ర్ది గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు కు పవన్ కళ్యాన్ వంతు పాడుతున్నారని నర్సాపురం వైసిపి ఎంపి అభ్య ర్ది రఘురామ రాజు ఆరోపించారు.