Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ అనర్హతపై టెన్షన్- వివరణకు గడువు కోరితే-వైసీపీ చివరి అస్త్రం అదే...

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ విధానాలతో విభేదిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ తో నోటీసులు ఇప్పించడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. అయితే నోటీసులకు రఘురామ ఇచ్చే వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. నిత్యం తమను చికాకుపెడుతున్న రఘురామపై ఈసారి ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ.. ఇప్పటికే ప్రకటించిన విధంగా పార్లమెంటులో నిరసనలు చేపడుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 రఘురామ అనర్హతపై ఉత్కంఠ

రఘురామ అనర్హతపై ఉత్కంఠ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నుంచి అనర్హత వేటుపై వైసీపీ చేసిన ఫిర్యాదుపై నోటీసులు జారీ అయ్యాయి. వీటికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని లోక్ సభ సచివాలయం ఆయన్ను కోరింది. ఈ నేపథ్యంలో రఘురామ ఇచ్చే సమాధానం, ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంటులో వైసీపీ చేపట్టాలనుకున్న నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో రఘురామ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో తన ఎంపీలు టీడీపీకి ఫిరాయించినా వేటు వేయించుకోవడంలో విఫలమైన వైసీపీ.. ఈసారి రఘురామ విషయంలో తమ పంతం నెరవేర్చుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.

 పార్లమెంటు సమావేశాల్లోనే వేటు వేయించేలా...

పార్లమెంటు సమావేశాల్లోనే వేటు వేయించేలా...

ఈ నెల 19న పార్లమెంట్ వర్షాకాల సమవేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆగస్టు 23 వరకూ ఈ సమావేశాలు జరగబోతున్నాయి. దీంతో ఈ సమయంలోనే రఘురామరాజుపై వేటు కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం లోక సభ స్పీకర్ వద్ద లాబీయింగ్ ముమ్మరం చేయడంతో పాటు పార్లమెంటులోనూ ఒత్తిడి పెంచేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. లోక్ సభ స్పీకర్ అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఆ లోపు రఘురామ వివరణ వస్తే ఆ తర్వాత వైసీపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేయబోతోంది.

 రఘురామ జవాబు కోసం వైసీపీ ఎదురుచూపులు

రఘురామ జవాబు కోసం వైసీపీ ఎదురుచూపులు

లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు జవాబిచ్చేందుకు ఆయనకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేందుకు ఆగస్టు 23 వరకూ గడువు ఉంది. ఈ మధ్యలో రఘురామ నుంచి లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు సమాధానం లభించే అవకాశం ఉంది. స్పీకర్ కు రఘురామ వివరణ అందగానే వెంటనే రంగంలోకి దిగి వేటు పడేలా ఒత్తిడి పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో రఘురామ కూడా ఆ మేరకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 గడువు లోగా రఘురామ వివరణ ఇస్తారా ?

గడువు లోగా రఘురామ వివరణ ఇస్తారా ?

లోక్ సభ సచివాలయం జారీ చేసిన నోటీసుల ప్రకారం వైసీపీ చేసిన అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకు 15 రోజుల గడువు ఉంది. అంటే ఈ నెలాఖరులోపు ఆయన స్పందించాల్సి ఉంటుంది. అయితే వివరణ ఇవ్వలేకపోతే అందుకు తగిన కారణాలను ఆయన లోక్ సభ స్పీకర్ కు నిర్ణీత గడువులోగా వివరించాల్సి ఉంటుంది. స్పీకర్ అనుమతితో వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కూడా కోరే అవకాశముంది. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నందున ఆ తర్వాత వివరణ ఇస్తానని చెప్పేందుకు కూడా వీలుంది. అయితే రఘురామరాజు ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Recommended Video

    #HyderabadRains: 24 గంట‌ల్లో భారీ వ‌ర్ష‌పాతం.. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు|KTR | Oneindia Telugu
     రఘురామ వివరణ ఆలస్యమైతే ?

    రఘురామ వివరణ ఆలస్యమైతే ?

    ఒకవేళ లోక్ సభ స్పీకర్ నోటీసుల ప్రకారం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వివరణ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, లోక్ సభ అందుకు అనుమతిస్తే అప్పుడు వైసీపీ ఇరుకునపడుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో రఘురామరాజుపై వేటు కోసం పార్లమెంటులో నిరసనలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ స్పీకర్ నోటీసుల నేపథ్యంలో వెంటనే నిరసనలు చేపట్టడానికి బదులుగా.. ఈ వ్యవహారం ఆలస్యమైతేనే పార్లమెంటులో నిరసనలు చేసేందుకు వైసీపీ వ్యూహచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా గడువులోగా రఘురామ వివరణ ఇచ్చేస్తే వేటు కోసం లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారం అంతా తిరిగి రఘురామ చేతుల్లోనే ఉండేలా కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+