అఖిలా.. సంస్కారం గురించి నువ్వా?,ఇప్పుడంతా పప్పు శిష్యులే: రోజా
శోభానాగిరెడ్డి గారి రక్తం పంచుకుపుట్టి ఆమె ఆశయాలకు తూట్లు పొడుస్తూ.. తండ్రిని చంపినవారికి మద్దతు పలుకుతున్న నువ్వా? సంస్కారం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.
విజయవాడ: నంద్యాల ప్రచారంలో భాగంగా వైసీపీ తరుపున ప్రచారానికి వెళ్లిన మ్మెల్యే రోజాను టీడీపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతకు తెరపడింది. అనంతరం ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశం పెట్టి టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అఖిలప్రియలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నాయకులు మహిళల సంక్షేమం గురించి మాట్లాడటాన్ని రోజా తప్పుపట్టారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను నిట్ట నిలువునా ముంచిన మీరా? మహిళల గురించి మాట్లాడేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న దాడులను ఏకరువు పెడుతూ టీడీపీని దుయ్యబట్టారు.
మీరా మహిళల గురించి మాట్లాడేది?:
'డ్వాక్రా మహిళలను మోసం చేశారు.. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగితే పక్షపాతంగా వ్యవహరించారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మహిళలను వ్యాపారంలోకి దించి నాశనం చేసినా వాళ్ల మీద చర్యలు తీసుకోలేదు.. అలాంటి మీరా మహిళల గురించి మాట్లాడేది?' అంటూ రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నారాయణ కాలేజీల్లో 25మంది విద్యార్థినులు అన్యాయంగా బలైపోతే.. దానికి కారణాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేబినెట్ లోనే ఉన్న నారాయణను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
అఖిలప్రియకు సంస్కారమా?
సంస్కారం, సంప్రదాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అంటూ మంత్రి అఖిలప్రియపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి చనిపోయి 24గం. గడవకముందే మంత్రి పదవి కోసం అసెంబ్లీకి వెళ్లిన నువ్వా సంప్రదాయం, సంస్కారం గురించి మాట్లాడేదని విమర్శించారు.
కట్టుబొట్టు లేకుండా చుడీదార్లు వేసుకుని తిరిగే నువ్వా సంప్రదాయం గురించి మాట్లాడేదని మండిపడ్డారు. శోభానాగిరెడ్డి గారి రక్తం పంచుకుపుట్టి ఆమె ఆశయాలకు తూట్లు పొడుస్తూ.. తండ్రిని చంపినవారికి మద్దతు పలుకుతున్న నువ్వా? సంస్కారం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.
జగన్తో పోలికా?:
తండ్రి చనిపోతే ఇప్పటికీ తండ్రి ఫోటో పెట్టుకుని తిరుగుతున్న జగన్ గురించా నువ్వు మాట్లాడేదని రోజా అఖిలప్రియపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని నమ్ముకున్నవారి కోసం జగన్ ఇప్పటికీ పోరాడుతున్నారని, కానీ తండ్రి చితి కూడా ఆరకముందే పదవుల కోసం వెళ్లిన నీకు ఆయనతో పోల్చుకునే అర్హత లేదని అన్నారు.
తల్లిదండ్రుల
కన్నా
పదవులకే
విలువ
ఇచ్చిన
నీకు
నైతిక
విలువలు
ఎక్కడివని
ప్రశ్నించారు.
85బార్
షాపులకు
ప్రభుత్వం
లైసెన్స్లు
ఇస్తే..
అందుకు
తలూపి,
వివాహితల
తాలిబొట్లు
తెంచాలని
చూస్తున్న
చూస్తున్న
నువ్వా
మహిళల
గురించి
మాట్లాడేదని
అఖిలప్రియను
నిలదీశారు.
సొంత
మేనమామ
కూడా
ఈరోజు
నీ
ఇంటికి
వచ్చే
పరిస్థితి
లేదని,
ఒకసారి
అద్దంలో
ముఖం
చూసుకుని
నీకు
నువ్వు
ఆలోచించుకుంటే
నిజాలేంటో
తెలుస్తాయని
అఖిలప్రియకు
సూచించారు.
దమ్ముంటే సభ పెట్టండి, పప్పు శిష్యులు:
మూడేళ్ల పాలనలో ఇది చేశాం, అది చేశాం అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం.. దమ్ముంటే నంద్యాలలో వైసీపీ తరహాలో లక్ష మందితో సభ పెట్టి, ఈ నియోజకవర్గానికి ఏం చేశారో జనాలకు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
ఒకప్పుడు పరమానంద శిష్యులు ఉన్నట్లే ఇప్పుడు పప్పు శిష్యులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. శిల్పా చక్రపాణి రెడ్డి గారితో జగన్ ఎలా అయితే రాజీనామా చేయించారో.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 20మంది ఎమ్మెల్యేలతో దమ్ముంటే రాజీనామా చేయించాలని రోజా సవాల్ విసిరారు. 'అమరావతిలో కూర్చొని 140సీట్లు గెలుస్తామని చెప్పడం కాదు పప్పు.. ఇక్కడికి వచ్చి మాట్లాడు' అంటూ లోకేష్ను ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా న్యాయం వైపు, ధర్మం వైపు ఉండాలని రోజా టీడీపీ నేతలకు హితవు పలికారు. నంద్యాల ప్రజలకు త్వరలోనే టీడీపీ గట్టి బుద్ది చెబుతారని తాను ఘంటాపథంగా చెబుతున్నట్లు చెప్పారు.