ఎలా చెప్పారో అర్థం కాలేదు: చంద్రబాబు 'స్వాగత' వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు
అమరావతి: ఏపీకి ఆర్ధిక సాయంపై క్లారిటీ ఇవ్వని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పబడుతున్నారు. కాగా, వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది.
అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేలా జైట్లీ ప్రకటన వచ్చిందని, ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు సిగ్గులేకుండా ఎలా చెప్పారో అర్థం కాలేదని అన్నారు.
ఇప్పుడు రాష్ట్రానికి హోదా లేకుండా చేశారని, కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏమీ రావని ఆమె అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు కావాల్సింది హోదాయేనని, అందుకోసం ఎంతవరకైనా పోరాడతామని ఆమె అన్నారు.

ఇందులో భాగంగానే అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. ఏపీకి హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, దాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మరో ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. హోదా వచ్చేవరకు పార్టీలకు అతీతంగా అందరం పోరాడాలని కోరుతున్నామని అన్నారు.
తనకు ముఖ్యమంత్రి హోదా ఉంది కదా అని 5 కోట్ల మంది ఆంధ్రులకు దక్కాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెట్టారని, ఇది చీకటి రోజు కాబట్టే తామంతా నల్ల దుస్తులతో వచ్చామని మరో మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు, దాని నుంచి బయటపడేందుకే ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె ఆరోపించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications