Zakia Khanam: టీడీపీని కాదని బీజేపీలో చేరిన వైసీపీ ముస్లిం ఎమ్మెల్సీ.. !
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపికై ఆ తర్వాత శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ కూడా పనిచేసిన జకియా ఖానం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒకే రోజు ఆమె రెండు సంచలనాలు రేపారు. ఇందులో ఒకటి ఇన్నాళ్లూ తాను పనిచేసిన వైసీపీకి ఇప్పుడు అకారణంగా గుడ్ బై చెప్పడం అయితే టీడీపీలో చేరడానికి బదులు బీజేపీలో చేరిపోవడం మరొకటి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా నేత జకియా ఖానంకు ఆ పార్టీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ కూడా చేసింది. జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఆమెకు ఈ పదవి దక్కింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె వైసీపీకి దూరం కావడం ప్రారంభించారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిశారు. వారితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. దీంతో ఆమె టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.

టీడీపీలో చేరతారని భావించిన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం ఇవాళ అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో ముస్లిం వర్గాలు బీజేపీకి క్రమంగా దూరమవుతున్న వేళ జకియా ఖానం ఇలా అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ నినాదం సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ పార్టీలో కుల మతాలకు తావు లేదని తెలిపారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అన్నారు. శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందన్నారు.
మరోవైపు జకియా ఖానం ఇలా టీడీపీని కాదని బీజేపీలో చేరడం వెనుక కూటమి వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఈ ముస్లిం ఎమ్మెల్సీని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపడం కాషాయ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎలాగో మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో బీజేపీకి ఆ పదవి ఇచ్చేందుకు వీలుగా జకియా ఖానంను ఇలా తమ పార్టీలో చేర్చుకున్నట్లు కనిపిస్తోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications