పార్లమెంట్లో సొమ్మసిల్లిపడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్: ఐసీయూలో చికిత్స
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో సోమవారం ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సుభాష్ చంద్రబోస్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.

Recommended Video
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగు ఎంపీలు ఆస్పత్రి వద్దకు చేరుకుని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగినట్లు పడిపోయినట్లుగా తెలిసింది. అంతకు ముందు.. ఆరో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సంస్మరణ సందేశం చదివి వినిపించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications