టిటిడి నగల వివాదంపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ వరప్రసాద్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఏపీ సీఎం ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. టిటిడిపి వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. టిటిడిలో చోటు చేసుకొంటున్న అన్యాయాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను టిటిడి నుండి తొలగించడం అన్యాయమని ఆయన చెప్పారు.

ఆరోపణలు చేసిన వారికి చట్టప్రకారంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి నగలపై జరుగుతున్న వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయమై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అందుకే సీబీఐ విచారణ జరిపిస్తే టిటిడిలో అసలు ఏం జరిగిందో తేలుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
టిటిడి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఇటీవల కాలంలో టిటిడిలో అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని పలు ఆరోపణలను చేశారు. టిటిడికి చెందిన పింక్ డైమండ్ కన్పించకుండా పోయిందని కూడ ఆయన బయటపెట్టారు. టిటిడిలో చోటు చేసుకొంటున్న వ్యవహరాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడ కలిసి టిటిడి విషయాలపై ఫిర్యాదు చేశారు.
అయితే టిటిడి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని ఈవో సింఘాల్ ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications