బహ్రెయిన్ లో శ్రీకాకుళం వాసుల నరకయాతన-రక్షించాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు సాయిరెడ్డి వినతి
ఏపీలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారు కరోనాతో పాటు వివిధ సమస్యల నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్ వెళ్లిన పలువురు శ్రీకాకుళం వలసదారులు నరకయాతన ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్ వెళ్లి అక్కడ వేధింపులు ఎదుర్కొంటున్న వారిని కాపాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విదేశాంగమంత్రి జై శంకర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోతో సహా పంచుకోవడంతో దీనిపై చర్చ మొదలైంది. బహ్రెయిన్ వెళ్లిన శ్రీకాకుళం వాసుల్ని అక్కడి ప్రభుత్వం, లేదా వారు పనిచేస్తున్న సంస్ధల సిబ్బంది దాడులు వేధించడం, గాయపరచడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అక్కడ వారు పడుతున్న నరకయాతన అర్ధమవుతోంది.

శ్రీకాకుళం జిల్లా నుంచి పొట్టకూటి కోసం బహ్రెయిన్ వెళ్లిన పేద కార్మికులను అక్కడ వారు పనిచేస్తున్న సంస్ధ తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫేస్ బుక్ వీడియోతో కోట్ చేసి చెప్పారు. సదరు సంస్ధలు శ్రీకాకుళం వారిని తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని వారిని రక్షించాలని విజయసాయిరెడ్డి విదేశాంగమంత్రిని వేడుకున్నారు. వేలాది మంది కార్మికుల్ని వారి స్వస్ధలాలకు తరలించేందుకు కేంద్ర ముందుకు రావాలని, ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
ఇప్పటికే కరోనా కారణంగా పలు గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయి, స్వదేశాలకు రాలేక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో బహ్రెయిన్ ఘటన ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని, స్ధానికుల్ని కలిచివేస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుని తమ కుటుంబ సభ్యుల్ని కాపాడాలని వారు కోరుతున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications