ఢిల్లీ కేంద్రంగా వైసీపీ అనూహ్య నిర్ణయం, కీలక మలుపు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ సైతం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తోంది. జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలోని పలు అంశాల పైన వైసీపీ గురి పెట్టింది. అందులో భాగంగా వ్యూహం మార్చింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వైసీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. అమరావతిలో అవినీతి జరుగుతోందని పదే పదే చెబుతోంది. ఇప్పుడు అమరావతి అంశం పైన కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సమాయత్తం అవుతోంది. ఇదే విషయాన్ని పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా స్పష్టం చేసారు.

ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం లో అన్ని వ్యవస్థలు అవినీతి మయం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీలో పని చేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. డీఎస్సీ పై సీబీఐ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేసారు. రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
కేంద్రానికి ఫిర్యాదుకు నిర్ణయం
డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదని.. అర్హులైన నిరుద్యోగులకు అవకాశం దక్కలేదని పేర్కొన్నారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందని.. దీని పైన సీబీఐ విచారణ జరగాలని.. లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. స్పోర్స్ట్ కోటా పేరుతో అనర్హుల కు ఉద్యోగాలు కట్టబెట్టారని.. అన్ని వ్యవస్థలు అవినీతి మయం అయ్యాయని ఆరోపించారు. డీఎస్సీ రూ 10 నుంచి రూ 15 లక్షల వరకు అమ్ముకున్నారని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతి పరులకు అవకాశం ఇచ్చారని.. వేలాది మంది మెరిట్ ఉద్యోగులు నష్టపోయారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగు తోందని.. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారని చెప్పారు. భూ కేటాయింపుల పైనా సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఒక్క చదరపు అడుగుకు రూ 20,500 ఖర్చు చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రూ 5 వేల లూపే చదరపు అడుగు నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. దీని పైన సమగ్ర దర్యాప్తు తో పాటుగా ఏపీలో దారుణ మైన పాలన గురించి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.













Click it and Unblock the Notifications