గ్రాండ్గా రోజా పుట్టినరోజు వేడుకలు : కేక్ తినిపించి విష్ చేసిన జగన్
నగరి: ఆత్మీయులు.. నియోజకవర్గ ప్రతినిధుల నడుమ టీడీపీ నగరి ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. పుట్టినరోజు గురువారం నాడు అయినప్పటికీ.. బుధవారం రాత్రి నుంచే సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు రోజా.

సీవీఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో.. నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజా భర్త సెల్వమణితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా వేడుకల్లో సందడి చేశారు. అనంతరం పుత్తూరులోని దివ్యాంగుల పాఠశాల, తిరుపతి ఎయిర్పోర్టు వద్ద రోజా వేడుకలను నిర్వహించారు.
ఇక గురువారం నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు రోజా. ఈ సందర్బంగా రోజాకు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు జగన్. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశారు రోజా.












Click it and Unblock the Notifications