గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసన, నినాదాలు - సభలో ఆ వెంటనే..!!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కాగానే.. వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మాజీ సీఎం జగన్ తో సహా వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సభ్యుల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ వెంటనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. సభకు హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం వేళ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నినాదాలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్స్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన మార్పులు... పథకాల అమలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.

ఆ సమయంలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అన్ని రంగాల్లో అద్భుత పాలన సాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ... నిరసనకు దిగారు. గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆ తరువాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసారు. ప్రభుత్వం సాధించిన పురోగతిని గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశాల వేళ ఎలా వ్యవహరించాలనే అంశం పైన చర్చించనున్నారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లవచ్చని జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్ల పై దాడులు, ఆర్దిక పరిస్థితి పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్దేశించారు.
కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం కానుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది. బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభ లో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో.. వైసీపీ హాజరు పై తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications