జగన్కు పోలవరం చిక్కు: ఏపీ మేకపాటిXటీ పొంగులేటి

లోకసభలో పోలవరం ఆర్డినెన్స్కు తమ పార్టీ అనుకూలమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు. ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చే సవరణకు తాము అనుకూలమని ఆయన పేర్కొన్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిని వ్యతిరేకించారు.
పోలవరం ఆర్డినెన్స్ను తాను వ్యతిరేకినని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండాలన్నారు.
కాగా, మంగళవారం లోకసభ పలుమార్లు పోలవరం, ధరల పెరుగుదల విషయమై వాయిదా పడిన విషయం తెలిసిందే. పోలవరం ఆర్డినెన్స్ తేవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోకసభలో ఆందోళన చేశారు. ఇతర విపక్షాలు ధరల పెరుగుదల పైన ఆందోళన తెలిపాయి.












Click it and Unblock the Notifications