టీడీపీ నిర్వాకం- కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వైసీపీ
తిరుపతి: ఏపీ రాజకీయాల్లో బోగస్ ఓట్లు, నకిలీ ఓటర్ల జాబితా.. కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం సహా పలు స్థానాల్లో నకిలీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తేల్చింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
కుప్పం నియోజకవర్గం పరిధిలో నకిలీ ఓటర్ల కారణంగానే చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తోన్నారనే అభిప్రాయానికి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు వైసీపీ నాయకులు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్క కుప్పం నియోజకవర్గం పరిధిలోనే 40 వేలకు పైగా దొంగఓట్లు ఉన్నట్లు వైసీపీ గుర్తించింది. ఈ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్నతమిళనాడు, కర్ణాటక గ్రామాలకు చెందిన వారి పేర్లను ఇందులో చేర్చారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. ఇలాంటి నియోజకవర్గాలను గుర్తించి దొంగఓట్లను తొలగించాలంటూ ఈసీని కలవబోతోన్నారు.
తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే విషయంపై స్పందించారు. నకిలీ ఓటర్ల బాగోతాన్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 60 లక్షలు నకిలీవేనని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. 2018-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఓటర్ల జాబితాలో చేర్చారని అన్నారు.
వాటిమీద చర్యలు తీసుకుంటూ ఉంటే తమ ఓట్లను తీసేస్తోన్నారంటూ టీడీపీ నాయకులు వితండవాదంతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ 60 లక్షల దొంగఓట్లను కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.
-
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications