వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చంద్రబాబు కదిలితే వణుకు - మా చుట్టూనే తిరిగేవారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలు కదిపితే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వణుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ శనివారం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకొంటున్నానని అనగానే ఈ పార్టీలు గడగడలాడుతున్నాయన్నారు. ఆ యాత్రకు రకరకాల కారణాలు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

ఆయన ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ స్వరూపం బయట పడుతుందని వాటి భయమన్నారు. రాష్ట్రంలో రగులుతున్న మంటలను ఆర్పి అందరికీ న్యాయం చేయమని బాబు కోరుతున్నారన్నారు. దానికి వీరికేమిటి బాధ? ఇరు పక్కలా ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ప్రభుత్వ వ్యవహారాల శైలిపై అనుమానాలున్నాయన్నారు.

బాబు చుట్టు తిరిగేవారు: నర్సిరెడ్డి

చంద్రబాబు ఢిల్లీ వెళ్తుంటే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉలిక్కిపడుతున్నాయని టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి వేరుగా అన్నారు. తెలగాణను తెచ్చేది, ఆపేది... జగన్‌కు బెయిల్ ఇచ్చేది, ఇప్పించేది తమ పార్టీయే అయితే.. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఎన్టీఆర్ భవన్ చుట్టునే తిరిగేవని కానీ, వారు ఢిల్లీ చుట్టు తిరిగి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలమూరులో ఇల్లు లేదు, పార్లమెంటులో నోరు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎన్ఎస్‌‍జి రక్షణ ఉంటుందని, అలాంటి వ్యక్తులు ప్రతి నిమిషం ఎక్కడకి వెళ్లారు, ఎవరిని కలిశాలనేది తెలుస్తుందని చెప్పారు.

English summary
Telugudesam Party senior MLA Payyavula Keshav said that YSR Congress and TRS are fear with Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X