పిన్నెల్లి బ్రదర్స్ కు మరో షాక్..! కోర్టు మరో కీలక ఆదేశం..!
ఏపీలో పల్నాడు రాజకీయాల్లో కీలక వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ వీరిద్దరినీ నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు వర్చువల్ గా పోలీసులు హాజరుపర్చారు.
టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గతంలో కోర్టు విధించిన రిమాండ్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. దీనిపై విచారణ జరిపిన జూనియర్ సివిల్ జడ్డి.. జనవరి 7వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. దీంతో వీరిద్దరూ జనవరి 7 వరకూ జైల్లోనే ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

గతేడాది పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై ఈ ఏడాది మే 25న పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గానూ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గానూ ఉన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిచిన పిన్నెల్లి సోదరులకు తాత్కాలిక ఊరట దక్కింది. దీనిపై తిరిగి ప్రభుత్వం బెయిల్ షరతుల ఉల్లంఘించారంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో అది కాస్తా రద్దయింది. అనంతరం వీరిద్దరూ గత నెలలో మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అనంతరం వీరిద్దరికీ రిమాండ్ విధించారు. అందులో భాగంగానే వీరు జైలు జీవితం గడుపుతున్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications