Race View: సీఎం ఇంట్లోకి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, కొత్త ఇంట్లో, ఎవరి జాగ్రత్తలు వాళ్లవి, ముందు జాగ్రత !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీఎం హోదాలో ఉండటానికి ప్రభుత్వం రేస్ వ్యూ 1 ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో బసవరాజ్ బోమ్మయ్ కొత్త ఇంటిలో అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కర్ణాటక హోమ్ మంత్రి హోదాలో ఉన్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే హోమ్ మంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కొట్టేసిన బసవరాజ్ బోమ్మయ్ రేస్ వ్యూ 1 ఇంటిలో ఉండటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంటిలో ఎవరు వెళ్లాలన్నా ఇక ముందు మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల దగ్గర ఇచ్చేసి వెళ్లాలి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉండబోతున్న ఇంటి గేట్ బయట ఇప్పటికే అధికారులు మొబైల్ నాట్ అలౌడ్ అని పెద్దగా రాసిన బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే అందరికి మంచిదని అధికారులు సీఎం ఇంటి దగ్గర ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఆర్ టీ నగర్ లో సీఎం
కర్ణాటక హోమ్ మంత్రి హోదాలో ఉన్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే హోమ్ మంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కొట్టేసిన బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని రేస్ వ్యూ -1 ఇంటిలో ఉండటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇల్లు ఖాళీ చేసిన అశ్వథ్ నారాయణ
యడియూరప్ప మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, కర్ణాటక ఐటీ శాఖా మంత్రిగా పని చేసిన డాక్టర్ అశ్వథనారాయణ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖా మంత్రిగా పని చేస్తున్నారు. రేస్ వ్యూ-1 ఇంటిని గతంలో డాక్టర్ అశ్వథనారాయణకు కేటాయించారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి ఆ ఇంటిని కేటాయించడంతో డాక్టర్ అశ్వథనారాయణ రేస్ వ్యూ-1 ఇంటిని ఖాళీ చేశారు.

రంగంలోకి దిగిన అధికారులు
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీఎం హోదాలో ఉండటానికి ప్రభుత్వం బెంగళూరులోని రేస్ వ్యూ- 1 ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో బసవరాజ్ బోమ్మయ్ కొత్త ఇంటిలో అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. మంచి ముహూర్తం చూసి బసవరాజ్ బోమ్మయ్ రేస్ వ్యూ-1 ఇంటిలో అడుగు పెట్టడానికి సిద్దం అయ్యారు.

ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే మంచిది
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంటిలో ఎవరు వెళ్లాలన్నా ఇక ముందు మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల దగ్గర ఇచ్చేసి వెళ్లాలి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉండబోతున్న ఇంటి గేట్ బయట ఇప్పటికే అధికారులు మొబైల్ ఫోన్లు నాట్ అలౌడ్ అని పెద్దగా రాసిన బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే అందరికి మంచిదని అధికారులు సీఎం ఇంటి దగ్గర ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు గతంలో కేటాయించిన కావేరి ఇంటిని అలాగే వదిలిపెట్టారు. కావేరి నివాసంలో యడియూరప్ప ఉంటారని, అందుకే ఆ ఇంటి జోలికి అధికారులు వెళ్లడం లేదని సమాచారం.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications