బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్ల కలకలం: సీఎం లక్ష్యంగా కాంగ్రెస్, తొలగింపు
బెంగళూరు:కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వినూత్న రీతిలో విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తరహాలో PayCM అంటూ పోస్టర్లు బుధవారం బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అంటించింది.
ఆ పోస్టర్లు ఎలక్ట్రానిక్ వాలెట్ Paytm ప్రకటనల మాదిరిగానే ఉన్నాయి. QR కోడ్ మధ్యలో "40 % ఇక్కడ అంగీకరించబడింది' అనే సందేశంతో బసవరాజ్ బొమ్మై ముఖ చిత్రం ఉంచారు.

ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్లను తొలగించారు.
Police remove posters targeting Chief Minister Basavaraj Bommai with his face on a QR code titled ‘PayCM’ have been spotted at CV Raman Road near Mekhri Circle and in a few other places in Bengaluru. | @PTI_News pic.twitter.com/Cf9kESMqeM
— Shailendra Bhojak (@muna2906) September 21, 2022
పేసీఎం పోస్టర్ల వ్యవహారంపై పోలీసు శాఖ స్పందించింది. వాటిని అంటించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
మరోవైపు, ఈ పోస్టర్లను అంటించిన వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. అంతేగాక, పోస్టర్లు అంటించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications