Doubt: కాఫీతోటలో ఆంటీని వెంటాడి నరికి చంపేసిన భర్త, కూతుర్లకు పెళ్లి అయిన తరువాత ఏం జరిగిందంటే?!
బెంగళూరు/ హాసన్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. కూతుర్లకు పెళ్లి అయిన తరువాత భర్త ఎలాంటి పని చెయ్యకుండా జులాయిగా తిరుగుతున్నాడు. భార్య తోటలో పని చెయ్యడానికి వెళ్లి వస్తోంది. బయటకు వెలుతున్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం పెరిగింది. కూతుర్లకు పెళ్లి అయిపోయినా నా భార్య చాలా అందంగా ఉందని భర్తకు ఇంకా అనుమానం మొదలైయ్యింది. కాఫీ తోటలో నడుచుకుంటూ వెలుతున్న భార్యను ఆమె భర్త వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది.
దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని బేలూరు తాలుకాలోని చిక్కనహళ్లిలో చంద్రయ్య (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం చంద్రయ్య ఇంద్రమ్మ (48) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న చంద్రయ్య, ఇంద్రమ్మ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.
కూతుర్లుకు పెళ్లి చేసి జులాయిగా తిరుగుతున్నాడు
చంద్రయ్య, ఇంద్రమ్మ దంపతులు ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన కూతుర్లు అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చి వెలుతున్నారు. కూతుర్లకు పెళ్లి చేసిన తరువాత చంద్రయ్య ఎలాంటి పని చెయ్యకుండా జులాయిగా గాలికి తిరుగుతున్నాడు.
పనికి వెలుతున్న భార్య
చంద్రయ్య ఎలాంటి పనికి వెళ్లకపోవడం, కూతుర్లు, అలుళ్లు ఇంటికి వచ్చి వెలుతుంటే ఖర్చులు ఎక్కువ కావడంతో ఇంద్రమ్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిసింది. ఇదే సమయంలో గ్రామం సమీపంలోనే ఉన్న కాఫీ తోటలో సాటి మహిళలతో కలిసి పనికి వెళ్లడానికి ఇంద్రమ్మ సిద్దం అయ్యింది.
తోటలో ఉంటున్న భార్య మీద డౌట్
బయటకు వెలుతున్న భార్య ఇంద్రమ్మ మీద ఆమె భర్త చంద్రయ్యకు అనుమానం పెరిగింది. కూతుర్లకు పెళ్లి అయిపోయినా నా భార్య ఇంద్రమ్మ చాలా అందంగా తయారై బయటకు వెలుతోందని ఆమె భర్త చంద్రయ్యకు ఇంకా అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో చంద్రయ్య, ఇంద్రమ్మ దంపతుల మద్య గొడవలు జరగుతున్నాయి.
కాఫీ తోటలో భార్యను నరికి చంపేసిన భర్త
కాఫీ తోటలో పని చెయ్యడానికి సాటి మహిళలతో కలిసి నడుచుకుంటూ వెలుతున్న భార్య ఇంద్రమ్మ మీద ఆమె భర్త చంద్రయ్య వేటకొడవలితో దాడి చేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఇంద్రమ్మను వెంటాడి నరికేశాడు. అడ్డుపడిన ఓ మహిళ మీద దాడి చేశాడు. భార్య ఇంద్రమ్మను వెంటాడి నరికి చంపేసి చంద్రయ్య తప్పించుకుని పరారైనాడు.