Hijab Row: టార్గెట్ లీడర్స్, ఆ ఎమ్మెల్యే ఆడిస్తుంటే, వీళ్లు ఆడుతున్నారు, పెత్తనం, పంచాయితీలు!
బెంగళూరు/ఉడిపి: హిజాబ్ (బుర్కాలు) వివాదం రోజురోజుకు ముదిరిపాకానపడుతోంది. కర్ణాటకలోని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Recommended Video
ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. హిజాబ్ దరించడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిల్లోని ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కాలేజ్ గేట్లు దగ్గరే అంతా జరిగిపోయింది?
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు హిజూబ్ ధరించి కాలేజ్ కు రాకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల నుంచి బుర్కాలు వేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు అడ్డుకుంటున్నారని ఇప్పటికే ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఆరోపణలు చేశారు..

హైకోర్టులో ఈ రోజు విచారణ
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ఆయేషా హజీరా అల్మాస్, రేషమ్ ఫారుక్, ఆలియా అస్సాది, శఫా, షమీమ్, ముస్తఫా జైనబ్ తదితరుల తరపున న్యాయవాది మోహమ్మద్ తాహీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కాలేజ్ విద్యార్థినిలు సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన న్యాయమూర్తి కృష్ణ ఎస్. దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ కర్ణాటక ప్రభుత్వంతో పాటు సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు అందరికి నోటీసులు జారీ చేసింది. అయితే హైకోర్టులోని ఉన్నత స్థాయి బెంచ్ కు పిటిషన్ విచారణ చేసిన జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్ ఆయన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నారు.

ఎమ్మెల్యే మీద విమర్శలు
ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్ హిజాబ్ విషయంలో ఓ వర్గం వారిని రెచ్చగోట్టే విదంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన కారణంగా హిజాబ్ గొడవలు ఎక్కువ అయ్యాయని ఆ కాలేజ్ లో చదువుతూ హైకోర్టును ఆశ్రయించిన అస్రఫ్ శిఫా ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్, ఆయన అనుచరులు ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అస్రఫ్ శిఫా మండిపడ్డారు.

ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువ అయ్యింది
హిజాబ్ (బుర్కాలు) వివాదం రోజురోజుకు ముదిరిపాకానపడుతోంది. కర్ణాటకలోని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే ఆడిస్తున్నారు....... వీళ్లు ఆడుతున్నారు
బీజేపీ మ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. హిజాబ్ దరించడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిల్లోని ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications