Illegal affair: నాటుకోడి ఆంటీ, మొగుడు మస్త్ మజా, గుడికి వెళ్లిన భార్య, పిల్లలు? అయినా!
బెంగళూరు7 బాగల్ కోటే: కామంతో భర్త కళ్లు మూసుకుపోవడంతో ఓ ఇంట్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరాయి స్త్రీ వ్యామోహంతో కట్టుకున్న భార్య, పిల్లలను గాలికి వదిలేసిన భర్త నాటుకోడిలాంటి ఉంచుకున్న ఆంటీతో కులుకుతూ ఊరేగాడు. బంధువులు, చూసినవాళ్లు సూటిపోటి మాటలు అనడంతో భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇంత జరిగినా కిలాడీ ఆంటీ ఆమె భర్తను వదలకుండా ఇంట్లో నుంచి కదలనివ్వలేదు. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలను బావిలో తోసిన తల్లి ఆమె అందులోకి దూకడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
lovers: ఓ వీడియో వీడి జీవితాన్నే మార్చేసింది, ప్రియురాలితో ఆ రోజు, కొంప ముంచిన ఫ్రెండ్స్!
భార్య పేరు నచ్చలేదేమో ?
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లా బాదామి తాలుకా మళకుర్కి గ్రామంలో వీరన్న, ఫక్కీరమ్మ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరన్న, ఫక్కీరమ్మ దంపతులకు నీలకంఠ (12) అనే కుమారుడు, కల్పన (10) అనే కుమార్తె ఉన్నారు. భార్య ఫక్కీరమ్మ పేరు నచ్చలేదో ఏమో కానీ కొంతకాలం నుంచి వీరన్న ఇంటికి సక్రమంగా రావడం లేదని తెలిసింది. కొడుకు నీలకంఠ పుట్టుకతోనే మూగవాడు.
నాటుకోడి ఆంటీని తగులుకున్నాడు
పక్కగ్రామంలో నివాసం ఉంటున్న బుజ్జీ అనే నాటుకోడి లాంటి ఆంటీతో వీరన్న అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పగలు రాత్రి అని తేడా లేకుండా వీరన్న ప్రియురాలు బిలాల్ బుజ్జీతో గడపడం మొదలుపెట్టాడు, తనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారనే విషయం మరిచిపోయిన వీరన్న బుజ్జీతో పిచ్చపాటిగా తిరిగేశాడు.
ప్రియురాలి సేవలో మొగుడు
సంసారం గురించి పూర్తిగా పట్టించుకోని భర్తను ఫక్కీరమ్మ అనేకసార్లు నిలదీసి గొడవ పెట్టుకునింది. ఇదే విషయంలో భార్య ఫక్కీరమ్మను ఆమె భర్త చిత్రహింసలకు గురిచేశాడు. భార్య ఫక్కీరమ్మ పోరు ఎక్కువ కావడంతో భర్త వీరన్న ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు. ప్రియురాలు బుజ్జీ సేవలో గడుపుతున్న భర్త తీరుతో ఫక్కీరమ్మ జీవితంపై విరక్తి పెంచుకునింది.
గుడికి వెళ్లి అనంతలోకాలకు
మంగళవారం ఫక్కీరమ్మ కొడుకు నీలకంఠ, కూతురు కల్పనతో కలిసి గుడికి వెళ్లింది. గుడితో పూజ చేయించుకున్న తరువాత ఫక్కీరమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో వ్యవసాయం పోలంలోని బావిలో కొడుకు నీలకంఠ, కూతురు కల్పనాను తోసేసిన ఫక్కీరమ్మ తరువాత అదే బావిలో ఆమె కూడా దూకడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు.
Recommended Video
ధరిద్రుడికి జాలిలేదు
భార్య, పిల్లల కోసం వీరన్న గాలించినా ఫలితం లేకపోయింది. బావిలో ముగ్గురి శవాలు తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన అక్రమ సంబంధం కారణంగా భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినా వీరన్నకు ఏమాత్రం భాద, జాలి లేకపోవడంతో వారి బంధువులు, ఊరివాళ్లు మండిపడుతున్నారు. బాదామి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.