Bomb: పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ స్కూల్ కు బాంబు బెదిరింపు, ఈమెయిల్ ఐడీకి ?, అసలు మ్యాటర్!
బెంగళూరు: పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ నాయకుడి కుటుంబ సభ్యులకు చెందిన పబ్లిక్ స్యూల్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. స్కూల్ లో 1, 5000 మందికి పైగా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఉదయం స్కూల్ ప్రారంభం అయిన వెంటనే బాంబు బెదిరింపు రావడంతో హడలిపోయిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులు అందరిని బయటకు పంపించేశారు.
కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు బెంగళూరు సిటీలోని రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో హిల్ వ్యూ పబ్లిక్ స్కూల్ ఉంది. సోమవారం ఉదయం స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ కు వెళ్లారు. ఈ స్కూల్ లో 1,500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో స్కూల్ లోని సిబ్బంది ఈ మెయిల్ ఇడీకి బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. హడలిపోయిన స్కూల్ సిబ్బంది, యాజమాన్యం రాజరాజేశ్వరినగర పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అందరిని ఇళ్లకు పంపించేశారు.
విషయం తెలుసుకున్న బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ లక్ష్మణ నింబరగి, పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యధళం సిబ్బంది, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకుని స్కూల్ ఆవరణం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబు చిక్కకపోవడంతో పోలీసు అధికారులతో పాటు స్కూల్ లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బంది, విద్యార్థుల కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు లేఖ ఏమెయిల్ ఐడీ నుంచి వచ్చింది అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.