IT Hub: విమానంలో చుక్క నీరు తాగకుండా విదేశాల నుంచి వచ్చాడు, రూ. 11 డ్రగ్స్ ఎక్కడ పెట్టాండంటే !
బెంగళూరు/ చెన్నై: స్మగ్లింగ్ చెయ్యడానికి కేటుగాళ్లు వేసే స్కెచ్ లు సినిమా డైరెక్టర్లకు కూడా రావని మరోసారి వెలుగు చూసింది. విదేశాల నుంచి చాకచక్యంగా ఐటీ హబ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని మరోసారి బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి విమానంలో చుక్క నీరు కూడా తాగకుండా వచ్చేశాడు. విమానంలో ఆహారం సరఫరా అయ్యేలా ఆ ప్రయాణికుడు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా సౌత్ ఆఫ్రికా నుంచి బెంగళూరు వచ్చేశాడు. పక్కా సమాచారం ఉన్నా కేటుగాడి లగేజ్ లో ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా చిక్కపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు. ఊపుకుంటూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి సిద్దం అయిన బ్లాక్ టైగర్ మీద అధికారులకు అనుమానం వచ్చింది. అంతే మనోడిని ఎత్తుకెళ్లి కాలి గోరి దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు పూర్తిగా స్కానింగ్ చేశారు. అంతే కేటుగాడి కడుపులో రూ. 11 కోట్ల విలువైన 1 కేజీ 25 గ్రాముల డ్రగ్స్ బయటపడటంతో అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది.

సౌత్ ఆఫ్రికా టూ బెంగళూరు
దక్షిణ ఆఫ్రికాకు చెందిన అనేక మంది యువతి, యవకులు ఐటీ హబ్ బెంగళూరులో విద్యాభ్యాసం చెయ్యాలని ఇప్పటికే కొన్ని వేల మంది వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన కొందరు దక్షిణా ఆఫ్రికా యువతి, యువకులు చదువు కోకుండా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.

రాత్రికి రేట్ ఫిక్స్ చేసి వ్యభిచారం చేస్తున్న యువతులు
బెంగళూరులోని హెణ్ణూరు, హెబ్బళా తదితర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు దక్షిణా ఆఫ్రికా యువతులు చదువు కోకుండా వ్యభిచారం చేస్తున్నారని ఇటీవల ఓ కన్నడ టీవీ చానల్ నిర్వహించిన సీక్రేట్ ఆపరేషన్ లో వెలుగు చూసింది. దక్షిణ ఆఫ్రికాకు చెందిన యువతి, యువకులు సంఘ వ్యతిరే కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని ఇటీవల వెలుగు చూడటంతో పోలీసులు వారి మీద గట్టి నిఘా వేశారు.

బెంగళూరు వచ్చిన కేటుగాడు
నైజీరియాకు చెందిన వ్యక్తి దక్షిణ ఆఫ్రీకాలోని జోహాన్స్ బర్గ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లోకి వచ్చాడు. ఎయిర్ పోర్టులోని సెక్యూరిటీ అధికారులు, కస్టమ్స్ అధికారులు దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు అందరి లగేజ్ లు పరిశీలించారు.

విమానంలో చుక్క నీరు కూడా తాగలేదు
దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి విమానంలో చుక్క నీరు కూడా తాగకుండా వచ్చేశాడు. విమానంలో ఆ ప్రయాణికుడికి ఆహారం సరఫరా అయ్యేలా టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా సౌత్ ఆఫ్రికా నుంచి బెంగళూరు వచ్చేశాడు. దక్షిణ ఆఫ్రికా నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని కస్టమ్స్ అధికారుల దగ్గర పక్కా సమాచారం ఉన్నా కేటుగాడి లగేజ్ లో ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా చిక్కపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు.

కడుపులో రూ. 11 కోట్ల విలువైన డ్రగ్స్
ఊపుకుంటూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి సిద్దం అయిన నైజీరియా బ్లాక్ టైగర్ మీద అధికారులకు అనుమానం వచ్చింది. అంతే మనోడిని ఎత్తుకెళ్లి కాలి గోరి దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు పూర్తిగా స్కానింగ్ చేశారు. కేటుగాడి కడుపులో రూ. 11 కోట్ల విలువైన 1 కేజీ 25 గ్రాముల డ్రగ్స్ బయటపడటంతో అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే నైజీరియా వ్యక్తిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కడుపులో ఏకంగా 1 కేజీ 25 గ్రాముల డ్రగ్స్ తీసుకుని వచ్చి అధికారులకు సినిమా చూపించిన నైజీరియా వ్యక్తిని అధికారులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications