సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసిన హైకోర్టు, వేలాది మందికి నకిలి ఇన్సూరెన్స్ బాండ్లు !
బెంగళూరు/తుమకూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల డేట్ ఫిక్స్ చేసిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తుమకూరు గ్రామీణ నియోజక వర్గం జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయితే నెల రోజుల పాటు తీర్పుపై స్టే ఇవ్వాలని ఎమ్మెల్యే తరపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు.
తుమకూరు గ్రామీణ ఎమ్మెల్యే డీసీ, గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ దత్ అనర్హత వేటు వేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద బీజేపీ నాయకుడు సురేష్ గౌడ ఇంతకాలం కోర్టులో న్యాయపోరాటం చేశారు. ఇంతకాలం సుదీర్ఘంగా విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద అనర్హత వేటు వేసింది.

2018లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో తుమకూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి జేడీఎస్ నాయకుడ గౌరీ శంకర్ ఆ నియోజక వర్గంలోని 32 వేల మందికి, 16 వేల పిల్లలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అందరికి ఇన్సూరెన్స్ బాండులు పంపిణి చేసిన గౌరీ శంకర్ జేడీఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
బీజేపీ నుంచి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గౌడ ఎన్నికల కమీషన్, పోలీసులకు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మీద ఫిర్యాదు చేశారు. అక్రమ మార్గంలో ఎమ్మెల్యే అయిన జేడీఎస్ లీడర్ గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద అనర్హత వేటు వెయ్యాలని సురేష్ గౌడ కోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదు అయిన కేసును రద్దు చెయ్యాలని ఎమ్మెల్యే గౌరీ శంకర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అతని పిటిషన్ కు కొట్టి వేసింది.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ నకిలి ఇన్సూరెన్స్ బాండులు పంపిణి చేసి ప్రజలను మోసం చేశారని సీఐడీ అధికారులు కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించారు. కేసు విచారణ చేసిన హైకోర్టు జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఎమ్మెల్యే పదవి మీద వేటు వేసింది. ఆరు సంవత్సరాలు గౌరీ శంకర్ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హత వేటుపడింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications