హిజాబ్ పై తాత్కాలిక నిషేధం-తుది తీర్పు వచ్చే వరకూ- కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్నాటక హిజాబ్ వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. హిజాబ్ పై ముస్లిం విద్యార్ధినులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న కర్నాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం... ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకూ విద్యాసంస్ధల్లో ముసుగులు ధరించకుండా సంయమనం పాటించాలని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు.. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కర్నాటకలోని కళాశాలలు తిరిగి తెరవవచ్చని పేర్కొంది. కానీ విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడానికి అనుమతించరాదని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కళాశాలలో విద్యార్థులు 'హిజాబ్' ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

దీనిపై సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. అయితే కేసును వాయిదా వేయడానికి ముందు, చీఫ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ కర్ణాటకలో కాలేజీలు తిరిగి తెరవవచ్చని, అయితే ఈ విషయం కోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించరాదని సూచించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications