నో పర్మిషన్: ఈద్గా మైదానంలో గణేశ్ వేడుకలకు సుప్రీంకోర్టు నో
వినాయక చవితికి ఊరు, వాడ సిద్దమవుతోంది. అంతా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. అయితే బెంగళూరు చామరాజుపేట ప్రాంతంలో గల ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని ఉత్సవ మండలి అనుకుంది. దీనిని ముస్లిం వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. దీనిపై కర్ణాటక హైకోర్టు గణేశ్ ఉత్సవ మండలికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వక్ఫ్ బోర్డు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముస్లిం సంస్థ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు రిజర్వ్ చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం హోల్డ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వేడుకలు నిర్వహించొద్దని స్పష్టంచేసింది.
ఈ నెల 26వ తేదీన ఈద్గా మైదానం ఉపయోగించాలని కోరుతూ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన దరఖాస్తును పరిశీలించింది. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏడాదిలో రంజాన్, బక్రీద్ కోసం గ్రౌండ్ ఉపయోగిస్తారు. మిగిలిన రోజు ఖాళీగానే ఉంటుంది. అయినప్పటికీ వక్ఫ్ బోర్డు అభ్యంతరం నేపథ్యంలో.. అలా ఇవ్వలేదు.