Lady: వాకింగ్ వెళ్లిన దంపతులు, చెరువులో కుర్చుని భర్తకు సినిమా చూపించిన భార్య, అసలు మ్యాటర్ వింటే!
బెంగళూరు/కోరమంగల: ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న దంపతులు ప్రతిరోజు వాకింగ్ కు వెలుతున్నారు. వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన తరువాత భార్య ఇంటి పని చేసుకుంటున్నది. ఇంట్లో టిఫిన్ చేసిన తరువాత భర్త అతని పనుల మీద బయటకు వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే దంపతులు వాకింగ్ కు వెళ్లారు. చెరువు సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో చిన్న విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మహిళ చెరువులోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
శరీరం మొత్తం నీళ్లలో ముగిపోయేలా, తల మాత్రం బయట కనపడే వరకు చెరువులోకి వెళ్లిన మహిళ నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. నీ చావు నువ్వు చావు అంటూ భర్త అక్కడే సైలెంట్ గా ఉండిపోయాడు. వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన వాళ్లు మహిళ చేస్తున్న రాద్దాంతం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని అక్కడే ఆమె భర్తను అదుపులోకి తీసుకుని, చెరువులో ఉన్న మహిళకు నచ్చచెప్పి బయటకు రప్పించారు. బెంగళూరులో కొన్ని గంటల పాటు జరిగిన హైడ్రా ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

కోరమంగలలో దంపతుల కాపురం
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని శ్రీమంతులు నివాసం ఉండే కోరమంగల 3వ బ్లాక్ లో ప్రశాంత్ రావ్, మాలాశ్రీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రశాంత్ రావ్, మాలాశ్రీ దంపతులు కోరమంగలలోనే నివాసం ఉంటూ సంతోషంగా కాపురం చేస్తున్నారు.

రోజూ వాకింగ్ కు వెలుతున్న దంపతులు
ప్రశాంత్ రావ్, మాలాశ్రీ దంపతులు ప్రతిరోజు కోరమంగల చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ లో వాకింగ్ చెయ్యడానికి వెలుతున్నారు. వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన తరువాత భార్య మాలాశ్రీ ఇంట్లో ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఇంట్లో టిఫిన్ చేసిన తరువాత మాలాశ్రీ భర్త ప్రశాంత్ రావ్ అతని పనుల మీద బయటకు వెళ్లిపోతున్నాడు.

వాకింగ్ చేస్తుంటే దంపతుల మద్య గొడవ
ఎప్పటిలాగే ప్రశాంత్ రావ్, మాలాశ్రీ దంపతులు వాకింగ్ కు వెళ్లారు. చెరువు సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో చిన్న విషయంలో ప్రశాంత్ రావ్, మాలాశ్రీ దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో ప్రశాంత్ రావ్, మాలాశ్రీల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మాలాశ్రీ చెరువులోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.

సినిమా చూపించిన భార్య
శరీరం మొత్తం నీళ్లలో ముగిపోయేలా, తల మాత్రం బయట కనపడే వరకు చెరువులోకి వెళ్లిన మాలాశ్రీ నేను ఆత్మహత్య చేసుకుంటానని గట్టిగా కేకలు వేస్తూ ఆమె భర్త ప్రశాంత్ రావ్ ను బెదిరించింది. నీ చావు నువ్వు చావు అంటూ ప్రశాంత్ రావ్ అక్కడే సైలెంట్ గా ఉండిపోయాడు.

హడలిపోయిన స్థానికులు
వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన వాళ్లు మాలాశ్రీ చేస్తున్న రాద్దాంతం గమనించి కోరమంగల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని అక్కడే మాలాశ్రీ భర్త ప్రశాంత్ రావ్ ను అదుపులోకి తీసుకున్నారు. నీ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని చెరువులో రాద్దాంతం చేస్తున్న మాలాశ్రీకి నచ్చచెప్పి మూడు గంటల తరువాత బయటకు రప్పించారు. బెంగళూరులో కొన్ని గంటల పాటు జరిగిన ఈ హైడ్రా ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications