క్యాబ్ యాప్ల 'అడ్వాన్స్ టిప్'దందా:ఊబెర్,ఓలా ర్యాపిడో పై సర్కార్ ఆగ్రహం..!
మీరు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాలి. క్యాబ్ బుక్ చేస్తుంటే, 'డ్రైవర్కు ముందుగానే టిప్ ఇస్తే త్వరగా పికప్ చేసుకుంటారు' అనే ఆప్షన్ కనిపిస్తే? ఇదే ఇప్పుడు ఉబెర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్లలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ 'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. "వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి" అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఈ విధానం నైతికంగా సరికాదని, ఇది క్యాబ్ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ గతవారం ఉబెర్కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది.ఉబెర్ వాదన ప్రకారం,ముందుగా టిప్ ఇస్తే డ్రైవర్లు రైడ్ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రాపిడో, ఓలా క్యాబ్స్ కూడా ఇదే తరహా విధానాలను అనుసరిస్తూ, త్వరగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలంటూ వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి.
ప్రభుత్వం సీరియస్:
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ, ఓలా, రాపిడోలతో సహా పలు రైడ్-హెయిలింగ్ యాప్లపై సీసీపీఏ దర్యాప్తు జరుపుతోందని ధృవీకరించారు. ఉబెర్ ఇప్పటికే సీసీపీఏ పరిశీలనలో ఉంది.సేవలు వేగంగా పొందేందుకు వినియోగదారులను ముందుగానే టిప్ చెల్లించమని బలవంతం చేయడం లేదా ప్రోత్సహించడం నైతికంగా తప్పని, దోపిడీతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.టిప్ అనేది ప్రశంసకు గుర్తుగా ఉండాలి కానీ, సేవకు ముందస్తు షరతు కాకూడదని స్పష్టం చేశారు.

అడ్వాన్స్-టిప్పింగ్ ఎలా మొదలైంది?
ఆసక్తికరంగా, ఈ వివాదాస్పద విధానం 2022లో కర్ణాటక ప్రభుత్వ మద్దతు ఉన్న 'నమ్మ యాత్రీ' యాప్తో ప్రారంభమైంది. 2023లో రాపిడో దీనిని అనుసరించగా, గత ఏడాది చివర్లో ప్రకటించిన ఉబెర్, ఏప్రిల్ 2025లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే రాపిడో సంస్థ మాత్రం ఈ విధానాన్ని సమర్థించుకుంది. ఒక కస్టమర్ రైడ్ బుక్ చేస్తే.. 30 సెకన్లలోపు ఏ డ్రైవర్ అయినా సరే రైడ్ను అంగీకరించనప్పుడు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.ఇక నమ్మ యాత్రీ యాప్లో కూడా టిప్ జోడించండి అనే పదాన్ని తీసేసి స్వచ్ఛందంగా టిప్ ఇవ్వండి అనే ఆప్షన్ చూపించడం ప్రారంభించింది. కస్టమర్ క్యాబ్ బుక్ చేస్తే వెంటనే ఈ అడ్వాన్స్ టిప్ అనే పదం కనిపించడం వల్ల తాను చెల్లించకపోతే మరొక కస్టమర్ చెల్లించి ఆ క్యాబ్ను బుక్ చేసుకుంటాడేమో అన్న భయాన్ని కలిగిస్తోంది.
వినియోగదారులు ఆగ్రహం:
ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో వంటి ప్రధాన రైడ్-హెయిలింగ్ సేవల 'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫిర్యాదులతో నిండిపోయాయిఈ అడ్వాన్స్ టిప్ మోసం బెంగళూరు ఆటోలతో మొదలైంది, నమ్మ యాత్రీ దీన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు ఇది వైరస్లా వ్యాపించింది - ఉబెర్, రాపిడో కూడా దీన్ని చేపట్టాయి. మెరుగైన సేవ పేరుతో రైడ్కు ముందే అదనపు డబ్బు అడగడం పచ్చి దోపిడీ అని కొందరు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని ఒక స్కామ్గా అభివర్ణిస్తున్నారు. ఊబెర్, రాపిడోలో ఈ అన్యాయానికి తెరదీశాయని అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు క్యాబ్ బుక్ చేసుకున్నాక టిప్ ఛార్జీలు 60శాతం లేదా 80శాతం చేరేవరకు డ్రైవర్లు రైడ్ను అంగీకరించరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు ఆటో వాళ్లతో బేరాలు ఆడకుండా ఉండటానికే ఈ యాప్లు వాడాం. ఇప్పుడు మళ్లీ యాప్లోనే డ్రైవర్లతో బేరం ఆడాల్సి వస్తోంది, ఇది చాలా బాధాకరం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఈ "అడ్వాన్స్ టిప్పింగ్" పద్ధతి వల్ల ఓలా, ఉబెర్, రాపిడో కంపెనీలు కేవలం ప్రభుత్వ పరిశీలనలోనే కాకుండా, తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications